2024 ఎన్నికల్లో చరిత్ర సృష్టించబోతున్న జగనన్న
చంద్రబాబు, పవన్ లకు రాజకీయ సన్యాసం తప్పదు
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పాలకమండలి అధ్యక్షులు మోహన్ రెడ్డి
కాపులను ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వేస్తున్న ఎత్తులను నమ్మరని వారిని కాపులే చిత్తు చేస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పాలకమండలి అధ్యక్షులు మోహన్ రెడ్డి తెలిపారు.
కాపుల ఓట్ల కోసం చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ ముఖాన్ని ముందు పెట్టి కాపుల ఓట్లు కొల్లగొట్టాలి అనేది బాబు ఎత్తుగడ. కానీ..కాపులు ప్రజారాజ్యం తరువాత రాజకీయంగా చేతులు కాల్చుకున్నారు. చిరంజీవిని నమ్మి దివాళ తీసిన కాపులు చాలా మంది ఉన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పెట్టినా ఆయన వెనుక నడవడానికి మెజార్టీ కాపులు ఇష్టపడటం లేదని మోహన్ రెడ్డి తెలిపారు. ప్రజారాజ్యం అనుభవాలు, జనసేన వెనుక చంద్రబాబు, ఉన్నారనే ప్రచారంతో కాపులు చాలా మంది పవన్ కల్యాణ్కు దూరంగా ఉంటున్నారు. జనసేన వెనుక చంద్రబాబు, ఉన్నారనేది ప్రచారం కాదు, వాస్తవమే అనే విధంగా పవన్ మాటలు, చేష్టలు ఉంటున్నాయి. 2014లో చంద్రబాబును గెలిపించడానికే జనసేన పోటీ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చంద్రబాబు వ్యూహంలో భాగంగానే పవన్ కల్యాణ్ నడిచాడని
2024 ఎన్నికలకు మొదటి మెట్టుగా ఇప్పటం సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం ఆధ్యంతం చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేసే విధంగా ఉందని కాపులు గ్రహించారని అన్నారు. ప్రఏభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని ఇప్పటం సభలోనే పవన్ శపథం చేశారు.
ఇదంతా ఎవరి కోసం..? చంద్రబాబు కోసం కాదా..? ఇక్కడే కాపులు పవన్ కల్యాణ్ మీద విరక్తి పెంచుకుంటున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని కాపులు మానసికంగా డిసైడ్ అయ్యారని మోహన్ రెడ్డి తెలిపారు.
2014-19 మధ్య చంద్రబాబు పాలనను, మూడున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికీ సీఎం వైఎస్ జగన్కు ప్రజల్లో 60శాతం మద్దతు ఉంది. పవన్ను అడ్డుపెట్టుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్న చంద్రబాబు నీచ రాజకీయాలను కాపులు నమ్మరని మోహన్ రెడ్డి తెలిపారు. కాపులు 30 ఏళ్లు పైబడిన వారు. సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ది, రాష్ట్ర అభివృద్ది కోసం ఆయన పడుతున్న తాపత్రయం గురించి ఆలోచిస్తున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన విద్యా, వైద్య సంస్కరణలు చూస్తున్నారు. 30 ఏళ్లు పైబడి నిజాయితీగా ఆలోచించే కాపులు జగన్కే జై కొడుతున్నారు. ఇక..50 ఏళ్ల పైబడిన కాపులు 90 శాతానికిపైగా వైఎస్ జగన్పై బలమైన నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికీ బలమైన కాపు ఓటు బ్యాంక్ సీఎం వైఎస్ జగన్తోనే ఉంది. పవన్ కల్యాణ్ చెప్పులు చూపించడం, నోటికొచ్చినట్లు మాట్లాడటం, విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపైదాడి, విజయవాడ నోవాటెల్లో చంద్రబాబుతో పవన్ భేటీ, హైదరాబాద్లో చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లడాన్ని మెజార్టీ కాపులు జీర్ణించుకోలేకపోతున్నారని మోహన్ రెడ్డి తెలిపారు.
ఒక పక్క లోకేష్ గ్రాఫ్ పడిపోకుండా ఉండటానికి జనవరి27 నుంచి పాదయాత్రకు ప్లాన్ చేశారు. మరో పక్క కాపుల ఓట్ల కోసం వారాహితో పవన్ను రోడ్డెక్కిస్తున్నారు. ఇంకోపక్క ఎల్లో మీడియాతో నిత్యం అబద్ధాలు చెప్పిస్తున్నారు, రాయిస్తున్నారు. మరో పక్క వందల కోట్లు గుమ్మరించి సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలకు తెగిస్తున్నారు. ఇంత చేస్తున్నా.. కాపులు, బడుగు, బలహీన వర్గాలు సీఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై, అభివృద్దిపై చర్చ జరగకుండా ఉండేందుకు హింసను రెచ్చగొట్టేలా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారని మోహన్ రెడ్డి తెలిపారు.
75 ఏళ్లుగా స్వాతంత్ర్య భారత చరిత్రలో కాగితాలకే పరిమితమైన సిద్దాంతాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నాయి. సీఎం జగన్ తన పాలనకు మానవత్వం జోడించి ముందుకెళ్తున్నారు. చదువే తలరాతను మారుస్తుందని, ఆంధ్రప్రదేశ్ పౌరులు గ్లోబల్ సిటిజన్స్ గా ఎదగాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. మాటలు చెప్పడమే కాదు.. అందుకు తగ్గ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఒక్క విద్యారంగం మీదనే మూడున్నరేళ్లలో రూ.55వేల కోట్లు ఖర్చు చేశారు. వైద్య రంగంలో దాదాపు 50 వేల ఉద్యోగాలిచ్చారు. చంద్రబాబు విద్య, వైద్య రంగాల ఊపిరి తీయడానికి ప్రయత్నిస్తే.. సీఎం జగన్ మాత్రం విద్య, వైద్య రంగాలే తమ ప్రభుత్వానికి పీఠిక అన్నట్లు పాలన చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతోన్న సంక్షేమాభివృద్దిని కాపు సోదర, సోదరీమణులు గమనిస్తున్నారు. వారు చంద్రబాబు -పవన్ మాయాజాలంలో చిక్కుకోరు. కాపు సోదరులు శతాబ్దాల వైరుధ్యం ఉన్న కమ్మలతో కలుస్తారని చంద్రబాబు అనుకోవడం భ్రమ. పవన్ ఆరాటమంతా చంద్రబాబును సీఎం చేయడం కోసమేనని కాపు సోదర, సోదరీమణులు ఓ అంచనాకు వచ్చారు. కాపు సోదరుల ఓట్ల తుఫాన్లో చంద్రబాబు – పవన్లు కొట్టుకుపోవడం ఖాయం. పవన్ అరుపులు, ఆర్తనాదాలు ప్యాకేజీ అరుపులు, ఆర్తనాదాలేనని మెజార్టీ కాపు సోదరులు, సోదరీమణులు బలంగా నమ్ముతున్నారని మోహన్ రెడ్డి జోస్యం పలికారు
ఒక్క సీటు లేని ఆయన, 68 నియోజకవర్గాల్లో ఇంచార్జిలేలేని పచ్చ బాబు ఇద్దరూ కలిసి జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోగలరా..? అనే ప్రశ్న వేసుకుంటే..వచ్చే సమాధానం..అడ్డుకోలేరనే. ఈ విషయం..మేక వన్నె పులులు చంద్రబాబు – పవన్లకు కూడా బాగా తెలుసు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, శ్రీ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయ పాలకమండలి అధ్యక్షుడు మోహన్ రెడ్డి తెలిపారు.